Padma Vibhushan to SP Balasubrahmanyam | దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. కరోనా బారిన పడి ఎస్పీ బాలు గత ఏడాది సెప్టెంబర్ 25న కన్నుమూశారు. ఎస్పీబీ మరణానంతరం ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్ను ప్రకటించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని మంగళవారం భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.