కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా చంద్రబాబు, ఎన్టీఆర్ ఎపిసోడ్ (NTR-CBN Episode) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1995లో జరిగిన ఈ రాజకీయ సంక్షోభం గురించి రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెబుతారు. అప్పుడు జరిగిన నిజానిజాలు, సంఘటనలు ఇప్పటికీ చాలామంది కళ్లముందు తిరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య ఏం జరిగింది..? అనేది ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతారు. ఆ రోజు జరిగిన దానిలో ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అనేది ఈ రోజుకి కూడా చాలామందికి క్లారిటీ లేదు.
ప్రతిపక్ష పార్టీలు మాత్రం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడు అని ప్రచారం చేస్తాయి. ఒక వేళ ఆ రోజు ఆయన వెన్నుపోటు పొడిస్తే ఎన్టీఆర్ కొడుకులు ఎందుకు సపోర్ట్ చేశారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. గత పాతికేళ్లుగా తెలుగునేలపై ఈ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. అయితే దీని గురించి ఏ రోజు కూడా నందమూరి వారసులు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయలేదు. మధ్యలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ వైస్రాయ్ హోటల్ ఉదంతంపై ఒక్క సినిమా కూడా తీశాడు. ఈ సమయంలో కూడా ఎవరూ మాట్లాడలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆహాలో వచ్చే unstoppable ఎపిసోడ్ లో ఈ విషయం గురించి స్పందించాడు బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ అఖండ టీం (Akhanda Team)తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆరోజు జరిగిన సంఘటన గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు నటసింహం. చాలామంది అంటుంటారు వెన్నుపోటు పొడిచాడు అని..దాని గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి అంటూ వైస్రాయ్ హోటల్ సంఘటన గురించి ఏదో చెప్పబోయాడు బాలకృష్ణ. ఆయన కొడుకుల్లో ఒకడిని..అభిమానిని అంటూ చెబుతుండగా ప్రోమో అయిపోయింది.
డిసెంబర్ 10న ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దాని కోసం నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది..ఆ విషయం గురించి బాలకృష్ణ ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్బాబు కపుల్