గతేడాది విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకీ లీడ్ రోల్లో చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఓ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. వెంకటేశ్ చేయబోయే 75వ సినిమా (Venkatesh 75th Movie) నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఉండబోతుందని ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
అయితే తాజాగా ఈ లీడింగ్ బ్యానర్ హింట్ ఇచ్చేసినట్టు అర్థమవుతుంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత ప్రొడక్షన్ నంబర్ 2గా రాబోతున్న కొత్త సినిమాను రేపు ప్రకటించనున్నట్టు అఫీషియల్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. వివరాలు రేపు.. అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమా వెంకీతో చేయబోయే ప్రాజెక్ట్ అయి ఉంటుందని అంతా తెగ చర్చించుకుంటున్నారు.
హిట్ ప్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని, కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరవబోతుందని ఇప్పటికే వచ్చిన వార్తలపై రేపు ఉదయం 11:07 గంటలకు క్లారిటీ రానుంది. వెంకటేశ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు.
నిహారిక ఎంటర్టైన్మెంట్ ట్వీట్
It was a blockbuster start for us with the Blockbuster Classic #ShyamSinghaRoy ❤️🔥
Thrilled to announce, Our 𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒊𝒐𝒏 𝑵𝑶 2 is going to be a Prestigious Project with an exciting combo🔥
More Details Revealing Tomorrow @ 11:07 AM 💥
Stay Tuned! pic.twitter.com/CwT5BZL69C
— Niharika Entertainment (@NiharikaEnt) January 22, 2023
Read Also : Mahesh Surapaneni | సినిమాల్లో పాటలు అవసరం లేదు.. ఆ సినిమాలే స్పూర్తి.. హంట్ డైరెక్టర్ మహేశ్ చిట్చాట్
Read Also : Selfiee Trailer | స్టార్ హీరో వర్సెస్ అభిమాని.. అక్షయ్ కుమార్ సెల్ఫీ ట్రైలర్
Read Also : Honey Rose | వీరసింహుని విజయోత్సవం.. స్పెషల్ అట్రాక్షన్గా హనీరోజ్
Read Also : Mangli | మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. షో నుంచి తిరిగొస్తుండగా ఘటన..!