COVID | న్యూఢిల్లీ: సింగపూర్లో కొవిడ్-19 కొత్త వేవ్ కోరలు చాచింది. వారం రోజుల్లోనే 26 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దవాఖానలు పడకల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు.
వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కొవిడ్ కేసులు గరిష్ఠస్థాయిలో పెరుగుతాయని, జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ చివరివారంలో 13,700 కేసులు నమోదైనట్టు వివరించారు.