ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ప్రాజెక్టు కే (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీ రోల్స్ చేస్తున్నారు. ప్రాజెక్టు కే 55 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని రీసెంట్గా అశ్వినీదత్ వెల్లడించారు. కాగా ఈ సినిమాపై ఓ పుకారు నెట్టింట షికారు చేస్తోంది.
అదేంటంటే ప్రాజెక్టు కే ఇటీవలే శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం పాయింట్ లైన్లో ఉండబోతుందని వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే వీటిని నాగ్ అశ్విన్ కొట్టిపారేశాడు. ‘ప్యారడైజ్లో బస్సు దిగిన ప్రతీ ఒక్కరూ బిర్యానీ తినలేరు..’అంటూ తనదైన స్టైల్లో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టి పుకార్లకు చెక్ పెట్టాడు నాగ్ అశ్విన్. ఈ పోస్టుతో ప్రాజెక్టుపై వస్తున్న నిరాధార ఆరోపణలను డైరెక్టర్ కొట్టిపారేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్టు కే కొత్త అప్డేట్ గురించి అభిమానులు చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ సినిమా చేస్తుండగా..షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు మరో పాన్ ఇండియా ప్రాజెక్టు ఆదిపురుష్లో నటిస్తుండగా..ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also : Nene Vasthunna teaser | అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ధనుష్ ‘నేనే వస్తున్నా’ టీజర్
Read Also : Telugu Film Chamber | తెలుగు ‘ఫిల్మ్ ఛాంబర్-ఫిల్మ్ ఫెడరేషన్’ చర్చలు సఫలం..వివరాలివే..!
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్లో అంతా షాక్..!
Read Also :God Father | ‘గాడ్ఫాదర్’ ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?