హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ, పట్టణ లోకల్ బాడీలు, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వెంటనే టీ ఫైబర్ను తమ ప్రైమరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికీ కొన్ని సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కనెక్టివిటీకి మారలేదని, ప్రైవేట్ ప్రొవైడర్లను వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ సంస్థల ధరల కంటే టీ-ఫైబర్ టారిఫ్ తక్కువ అని, డాటా సెక్యూరిటీ రిస్క్ కూడా తక్కువేనని పేర్కొన్నది. టీ-ఫైబర్ 24×7 నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్(ఎన్వోసీ) ద్వారా సేవలు అందించడంతోపాటు డాటా భద్రతకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(ఎస్వోసీ) ఏర్పాటుచేసినట్టు వెల్లడించింది. ఐవీఆర్ఎస్ ద్వారా కస్టమర్ సర్వీసులు, వాట్సాప్ ద్వారా సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపింది.