తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీపరిశ్రమ (Telugu cinema)కు చెందిన సినీ కార్మికులు (film workers) ఆగస్టులో సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమ్మెతో దిగొచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) కార్మికుల వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ నుంచి మళ్లీ షూటింగ్స్ మొదలయ్యాయి.
తాజాగా ఈ విషయానికి సంబంధించి దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మిగిలిన సమస్యలపై చర్చించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సమావేశంలో చర్చలు సఫలమైనట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
వేతన పెంపు ఇలా..!
భారీ బడ్జెట్ చిత్రాలకు రోజువారీ కార్మికుల వేతనాలను 30%, చిన్న బడ్జెట్ చిత్రాలకు 15% పెంచాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఏది భారీ బడ్జెట్ సినిమా, ఏది చిన్న బడ్జెట్ సినిమా అనేది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ -తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్ణయించనున్నాయట. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రేపు ఫిల్మ్ చాంబర్ ప్రకటన వెలువరించనున్నట్టు సమాచారం.
త్వరలోనే కార్మికుల వేతన పెంపు విధివిధానాలపై చర్చలు జరుగుతాయని, పెంచిన జీతాలు చెల్లించే బాధ్యత ఫిల్మ్ ఫెడరేషన్, ఫిలించాంబర్లదేనని ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రకటించారు. వేతనాల పెంపునకు దిల్రాజు నేతృత్వంలో కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. తాజా భేటీలో తీసుకున్న నిర్ణయంతో కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరికినట్టైంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే సినీ కార్మికులకు ఇది గుడ్న్యూస్ అనే చెప్పాలి.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?