టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చే ఏడాది తన 100వ సినిమా (Nag100)ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. కెరీర్లో మైల్స్టోన్లా నిలిచిపోయేలా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు నాగ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.
ఈ స్పెషల్ ప్రాజెక్టు కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నా. ఈ నలుగురు దర్శకుల్లో పర్ఫెక్ట్ ఐడియాతో వచ్చిన వ్యక్తితో సినిమా ప్రకటిస్తానని చెప్పాడు అక్కినేని హీరో. ఇటీవల కాలంలో నాగ్ సీనియర్ దర్శకులతో కాకుండా రాహుల్ రవీంద్రన్, శ్రీరామ్ ఆదిత్య, కల్యాణ్ కృష్ణ కురసాల, ప్రవీణ్ సత్తారు లాంటి యువ దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా, ఇప్పటి ట్రెండ్ను ఫాలో అవుతూ కథలు రాయాలంటే యువ దర్శకులతోనే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మరి నాగార్జున తన ప్రతిష్మాత్మక సినిమా బాధ్యతలు ఏ దర్శకులకు అప్పగించాడు..ఇంతకీ నాగ్ను ఇంప్రెస్ చేసే ఆ దర్శకుడెవరనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావొచ్చని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
వన్ ఆఫ్ ది కీ రోల్ చేసిన బ్రహ్మాస్త్ర (Brahmastra) సక్సెస్ టాక్ తెచ్చుకోవడంపై స్పందిస్తూ..హిందీ ప్రేక్షకులు తనను ఎల్లప్పుడూ గ్రాండ్గా వెల్కమ్ చెబుతుంటారని అన్నారు. సినిమా నా పాత్రను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. స్పందన అద్బుతంగాఉందని అన్నాడు.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Taapsee vs Reporter | ‘నా ప్రశ్నకు జవాబిస్తే..మీకు సమాధానమిస్తా..’రిపోర్టర్ వర్సెస్ తాప్సీ..వీడియో వైరల్