వివాదాస్పద, ఆసక్తికర ట్వీట్స్, కామెంట్స్ తో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచే వ్యక్తులకు కొదవేమీ లేదు. ఈ విషయానికి సంబంధించి టాలీవుడ్ సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh). స్టార్ హీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను బండ్ల గణేశ్ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీసారి ఏదో ఒక కామెంట్తో వార్తల్లో నిలుస్తుంటారు. కొన్నిసార్లు ఆయన చేసిన ట్వీట్స్ పై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి.
కాగా ఇపుడు బండ్ల గణేశ్ మరోసారి పవన్ కల్యాణ్ టాపిక్తోనే హాట్ టాపిక్గా మారిపోయారు. ఓ సినిమా ఈవెంట్లో యువ హీరోలు అడివిశేష్ (Adivi Sesh), సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) చాలా రిలాక్స్డ్గా, స్టైలిష్గా సీట్లలో కూర్చున్నారు.మరో ఈవెంట్లో పవన్ కల్యాణ్ పద్దతిగా, వినయంగా కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు. బండ్ల గణేశ్ ఈ రెండు ఫొటోలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ స్టార్గా కొనసాగుతున్నప్పటికీ సింప్లిసిటీ, పెద్దల పట్ల గౌరవంగా మెదులుతుంటారు..అని ట్వీట్ చేశారు. అయితే ఈ కొంత వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ఈ ట్వీట్పై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ రియాక్షన్స్ వచ్చాయి.
హీరోలు సాధారణంగా కూర్చుంటారని..కానీ గర్వం ప్రదర్శించడానికి కాదని కొంతమంది అతని ట్వీట్ను షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెట్టగా..మరికొందరేమో అడివిశేష్, సిద్దులపై బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చేందుకు పవన్ కాలు మీద కాలు వేసుకున్న స్టిల్స్ ను పంచుకున్నారు. ఈ ట్వీట్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Taapsee vs Reporter | ‘నా ప్రశ్నకు జవాబిస్తే..మీకు సమాధానమిస్తా..’రిపోర్టర్ వర్సెస్ తాప్సీ..వీడియో వైరల్
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?