శ్రీమంతుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్పైకి ఎంట్రీ ఇచ్చి..తొలి ప్రయత్నంలోనే రికార్డులు సృష్టించింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ఆ తర్వాత జనతాగ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి భారీ హిట్స్ ను ఇండస్ట్రీకి అందించింది. ఇటీవలే నానితో అంటే సుందరానికి సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకుంది. వన్ ఆఫ్ ది లీడింగ్ హౌస్గా కొనసాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగు (Telugu Movies)లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఈ అగ్ర నిర్మాణ సంస్థ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలను లైన్లో పెట్టింది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ను రౌండప్ చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్..ఇక మలయాళ (Mollywood) ప్రేక్షకులకు కూడా మంచి సినిమాలు అందించేందుకు ప్లాన్ చేస్తుందన్న వార్త ఇపుడు హాట్ టాపిక్గా మారింది. తాజా టాక్ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ కేరళకు వెళ్లి..మాలీవుడ్లోని కొందరు ఇండస్ట్రీ పెద్దలతో చర్చించారట.
సీనియర్ టెక్నీషియన్స్ తో సమావేశమై కోచిలో ప్రొడక్షన్ హౌస్ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే మలయాళ స్టార్లు మోహన్ లాల్ (Mohan Lal), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), నజ్రియాతోపాటు పలువురు యాక్టర్లతో మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నేరుగా మలయాళ సినిమాలు కూడా తెరకెక్కించి ఇతర భాషల్లో కూడా అందించాలని వస్తున్న వార్తల్లో అఫీషియల్ కాకపోయినప్పటికీ..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
మొత్తానికి మైత్రీ టీమ్ తన స్థావరాన్ని విస్తరించడానికి ప్లాన్ చేస్తుండటం నిజమే అయితే మూవీ లవర్స్ కు మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భవిష్యత్లో ఇటు తెలుగు, అటు మలయాళంలో సినిమాలు రాబోతున్నాయన్నమాట. మరి దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also : Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్