హీరోయిన్ మానుషీ చిల్లర్ (Manushi Chhillar) అరుదైన అవకాశం దక్కించుకుంది. యునెటైడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (UNDP) లో భాగస్వామిగా మారబోతున్నది. వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ (World Immunization Week) ప్రచారం కోసం మానుషీ చిల్లర్ ఎంపికైంది. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ..ఆ తర్వాత నాయికగా బాలీవుడ్ (Bollywood)లో తెరంగేట్రం చేసింది. అక్షయ్ కుమార్ సరసన పృథ్వీరాజ్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది.
పరిశుభ్రత, ఇమ్యునైజేషన్, కోవిడ్, హెచ్ఐవీ..ఇలా అనేక అంశాల మీద యునెటైడ్ నేషన్స్ డెవలప్ మెంట్ పోగ్రాం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. పాండమిక్ టైమ్ లో వ్యాక్సినేషన్ మీద ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పలు చోట్ల ఇంకా మహమ్మారి ఉండటం వల్ల ఈ ఏడాది కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో మానుషీ చిల్లర్ కనిపించనుంది.
తనకొచ్చిన అరుదైన అవకాశంపై మానుషీ చిల్లర్ స్పందిస్తూ….యూఎన్ డీపీ ప్రచారంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. తక్షణం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఎన్నో అంశాలున్నాయి. వాటిని బాగా ప్రచారం చేసేందుకు నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా. అని చెప్పింది. పృథ్వీరాజ్ మూవీతో పాటు గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే మరో చిత్రంలో నటిస్తున్నదీ తార.