టాలీవుడ్ (Tollywood) యువ హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయబోతుందని మేకర్స్ ప్రకటించారు.
మరో అప్డేట్ కూడా అందించారు మేకర్స్. ఈ చిత్రం చివర పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ పాటను కూడా త్వరలోనే షూట్ చేయనున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పార్టుకు సంబంధించిన రీరికార్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
రాజ్కుమార్ ఆకెళ్ల మాచెర్ల నియోజకవర్గం ప్రాజెక్టును సమర్పిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన నేపథ్యంలో నితిన్ అండ్ టీం సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
Except for one song, the entire talkie part of @actor_nithiin's #MacherlaNiyojakavargam has been completed ✅🔥
Ready to take charge on Theatres from August 12th! ⚠️💥#MNVFromAug12th ✨@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #MahathiSwaraSagar @SreshthMovies @adityamusic pic.twitter.com/WyIlhS1d9E
— Sreshth Movies (@SreshthMovies) June 24, 2022