అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది నార్త్ భామ లావణ్య త్రిపాఠి. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ఈ భామ టాప్ బ్రాండ్ తో ఎండార్స్ మెంట్ డీల్ కుదుర్చుకుందట. పాపులర్ ఆయిల్ బ్రాండ్ గోల్డ్ విన్నర్ కు లావణ్యత్రిపాఠి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకమైనట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
సౌతిండియా మొత్తానికి లావణ్య త్రిపాఠి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుందని టాక్. ప్రస్తుతం చెన్నైలో యాడ్ షూట్ కొనసాగుతుందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి ఇటీవలే తన సొంత పట్టణం డెహ్రాడూన్ లో న్యూ కేఫ్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఏ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాల్లో మెరిసన లావణ్య తన తర్వాత చిత్రమేంటనేది త్వరలోనే వెల్లడించనుంది. ఓ వైపు సినిమాలతోపాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో రెండు చేతులా సంపాదించనుంది లావణ్యత్రిపాఠి.
ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్