Lata Mangeshkar | నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ మరణించి రెండు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఆవిడ గురించి సోషల్ మీడియాలో కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. 92 ఏండ్ల వయసులో ముంబైలోని బ్రాంచ్ క్యాండీ హాస్పిటల్లో కరోనాతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు గానకోకిల. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు లతా జీ. ఆమెను కాపాడడానికి వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం కాలేదు. వయోభారం కారణంగా ఆమె ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. ఈమె మరణ వార్త తెలుసుకుని దేశమంతా కన్నీరు కార్చింది. సంగీతం తన స్వరాన్ని కోల్పోయింది అంటూ కోట్లాది మంది సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.
73 ఏండ్ల సినీ కెరీర్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు లతా మంగేష్కర్. అయితే తెలుగులో మాత్రం కేవలం మూడు పాటలకే పరిమితం కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. బాలీవుడ్లో మాత్రం ఒకానొక సమయంలో లతాజీ తప్ప మరో సింగర్ లేదు అన్నట్లుగా.. ఆమెతో పాటలు పాడించుకునేందుకు మ్యూజిక్ డైరెక్టర్స్ క్యూ కట్టేవాళ్లు. కెరీర్ పీక్లో ఉన్నపుడు రోజుకి కనీసం 10 పాటలు పాడిన రోజులు కూడా ఉన్నాయి. తెలుగులో మాత్రం సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా.. ఆ తర్వాత దొరికితే దొంగలు, ఆఖరి పోరాటం సినిమాల్లో ఈమె పాడారు. ఆరేండ్ల కింద లతా మంగేష్కర్కి బహుబలి సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2లో కన్నా నిదురించరా పాట హిందీ వర్షన్ను లతా మంగేష్కర్తో పాడించాలని ఎంఎం కీరవాణి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సమయంలో లతా మంగేష్కర్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో చాలా సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత హిందీలో ఈ పాటను మధుశ్రీ పాడగా.. లతా మంగేష్కర్ ఈ సాంగ్ను ప్రశంసించారు. అలా మొత్తానికి బాహుబలిలో పాట పాడే అవకాశం లతాజీ వదిలేసుకుంది లేదంటే ఆమె చివరి సినిమా పాట ఇదే అయ్యుండేది.
Read More :
కెరీర్లో దూసుకెళ్తున్న టైంలో లతా మంగేష్కర్పై విషప్రయోగం.. చేసింది ఎవరో..
లతా మంగేష్కర్ పెండ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి.. ఒంటరిగా ఎందుకు ఉండిపోయారు..?
1950ల్లో ఒక్కో పాటకు లతాజీ ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు..?
పాట పాడుతూ కింద పడిపోయిన లతా మంగేష్కర్.. ఈ సంఘటన గురించి తెలుసా..?
Lata Mangeshkar | తెలుగులో మూడే పాటలు పాడిన లతా మంగేష్కర్.. కారణం ఏంటో తెలుసా?