Lata Mangeshkar | కేవలం దేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రస్తుతం లతా మంగేష్కర్ గురించి మాట్లాడుకుంటున్నారు. 92 సంవత్సరాల వయసులో ఆమె ముంబైలోని బ్రెంచ్ క్యాండీ ఆస్పత్రిలో ఫిబ్రవరి 6 ఉదయం 8: 12 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆమె చనిపోయిందనే విషయం తెలుసుకున్న తర్వాత సంగీత అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. లతాజీ పాడిన పాటలను తలచుకుంటూ ఆమెకు ఘన నివాళి అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈమె చనిపోయిన తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఒక పాట రికార్డింగ్ చేస్తున్న సమయంలో లతా మంగేష్కర్ కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఆమెనే స్వయంగా చెప్పింది. ఒకప్పుడు రోజుకు 10-15 పాటలకు పైగా రికార్డు చేసేవారు. అప్పట్లో ఆమె చాలా అంటే చాలా బిజీగా ఉండేది. అదే సమయంలో ఒక పాట రికార్డ్ చేస్తున్నపుడు ఆమె సొమ్మసిల్లి కింద పడిపోయారు. సంగీత దర్శకుడు నౌషాద్తో పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి స్పృహ తప్పి పడిపోయారు లతా. మండు వేసవిలో ఓ మధ్యాహ్నం ఒక పాట రికార్డ్ చేస్తున్నపుడు.. కళ్లు తిరిగి కింద పడిపోయానని గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈమె.
వేసవిలో ముంబై ఎలా ఉంటుందో మీకు తెలుసు.. ఆ రోజుల్లో రికార్డింగ్ స్టూడియోల్లో ఏసీ లేదు.. ఫైనల్ రికార్డింగ్ సమయంలో డిస్టబెన్స్ వస్తుందని సీలింగ్ ఫ్యాన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు.. దాంతో తాను మూర్చబోయానని చెప్పారు లతా. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. మళ్లీ ఆ తర్వాత లేచి మిగిలిన పాటను పూర్తి చేశారు లతా మంగేష్కర్. తన కెరీర్లో జరిగిన అరుదైన సంఘటనలలో ఇది కూడా ఒకటి అని గుర్తు చేసుకునే వాళ్లు గాన కోకిల.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Lata Mangeshkar | సినీ అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే లతా మంగేష్కర్ పాటలు ఇవే
Lata Mangeshkar | తెలుగులో మూడే పాటలు పాడిన లతా మంగేష్కర్.. కారణం ఏంటో తెలుసా?
Lata Mangeshkar | వరల్డ్ కప్ గెలిచిన జట్టును లత ఎలా ఆదుకున్నారంటే…
Latha didi: ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం లతాజీ..