టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally), కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చెన్నైలో గ్రాండ్గా లాంఛ్ అయింది. విజయ్ (Vijay 66th) 66వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టును దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)పై నిర్మిస్తున్నారు.
ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు ఇచ్చిన ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్కు తండ్రిగా స్టార్ యాక్టర్ కనిపించబోతున్నాడట. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ యాక్టర్ శరత్ కుమార్ (r sarathkumar) ఈ పాత్రలో కనిపించనున్నట్టు టాక్ నడుస్తోండగా..దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
భారీ బడ్జెట్ సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandana) ఫీ మేల్లీడ్ రోల్ చేస్తోంది. ఊపిరి సినిమా తర్వాత వంశీపైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.