బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్ (Prabhas). అయితే బాహుబలి ప్రాంఛైజీతో అద్బుతమైన సక్సెస్ అందుకున్న ఈ యంగ్ రెబల్ స్టార్కు ఆ తర్వాత మళ్లీ సక్సెస్ రాలేదు. ఇటీవలే వచ్చిన రాధేశ్యామ్ (RadheShyam) కూడా బాక్సాపీస్ వద్ద ప్రభాస్కు నిరాశనే మిగిల్చింది. దీంతో మళ్లీ ఎలాగైనా ట్రాక్పైకి రావాలని కసిగా ఎదురుచూస్తున్నాడు ప్రభాస్. మునుపటిలా తన అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్రభాస్ ఇపుడు ప్రధానంగా రెండు ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టబోతున్నాడని ఓ న్యూస్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఈ హీరో చేతుల్లో ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్టు కే (Project K), సలార్ (Salaar) సినిమాలున్నాయి. ఈ మూడు కూడా పాన్ ఇండియా కథాంశాలతోనే వస్తున్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో ప్రభాస్ ఏ మూవీపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడనేది తెలియక అభిమానులకు తలలు పట్టుకున్నంత పనవుతుంది. మరి దీనిపై ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చే ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రభాష్ ఈ మూడింటిలో రెండు ప్రాజెక్టులు తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడట.
అవి సలార్, ప్రాజెక్టు-కే సినిమాలు. మొదట ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత మిగిలిన సినిమాలవైపు టైం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ టాక్. మోకాల్ సర్జరీని నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్లో జాయిన్ కానున్నాడు ప్రభాస్. మొత్తానికి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ కానీ, నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్టు కే కానీ..ఏదో ఒకటి మళ్లీ మునుపటి ప్రభాస్ను అందరికీ చూపిస్తుందా..? లేదా అనేది చూడాలి.