ఆర్ఆర్ఆర్ (RRR) మేనియా కొనసాగుతోంది..ఈ సక్సెస్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి (SS Rajamouli). ఈ క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్కు కొంత గ్యాప్ కూడా ఇవ్వకుండా మూవీ లవర్స్ కు ఏదో ఒక కొత్త అప్డేట్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఆ అప్డేట్ మహేశ్ బాబు (Mahesh Babu)తో చేసే ప్రాజెక్టు గురించే అని అర్థమయే ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉండబోతుందని టాలీవుడ్ సర్కిల్ టాక్.
కాగా రీసెంట్ చిట్చాట్లో మహేశ్ తో చేయనున్న సినిమా గురించి రిపోర్టర్లు అడుగగా..ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చేసి అభిమానులను ఖుషీ చేశాడు జక్కన్న. మహేశ్బాబుతో నేను చేయబోయే నెక్ట్స్ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ (Action adventure)గా ఉండబోతుంది. అందులో ఎలాంటి సందేహాలు లేవు అని చెప్పి కుండబద్దలు కొట్టేశాడు. ఈ సినిమా బిగ్ స్క్రీన్ ఎంటర్టైనర్. బలమైన భావోద్వేగాలతో సాగే పూర్తి యాక్షన్ అడ్వెంచర్ అని క్లారిటీ ఇచ్చేశాడు.
మహేశ్ బాబుతో తాను పనిచేయాలని ఎక్జయిటింగ్గా చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆశిస్తున్న ఎంటర్టైనర్ ను అందించడం ఖాయమని ప్రామిస్ చేశాడు జక్కన్న. మొత్తానికి తాజాగా రాజమౌళి చేసిన కామెంట్స్ తో, ఇన్నాళ్లు మహేశ్-జక్కన్న సినిమాపై నెలకొన్న సందేహాలపై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చినట్టైంది.
మహేశ్ ప్రస్తుతం గీతగోవిందం డైరెక్టర్ పరశురాంతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. మరోవైపు మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.