భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ హిందీలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేస్లో పోటీ పడుతుంది. సినిమాల సంగతేమో కాని కియారా ఎప్పుడూ తన ఫొటోషూట్స్, ప్రేమాయణంతోనే హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది.
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడిపిస్తోందని కొన్నాళ్లుగా బీటౌన్లో ప్రచారం నడుస్తోంది. ఇద్దరూ కలిసి హాలీ డే వెకెషన్లకు కూడా వెళ్తుండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ కలిసి తాజాగా షేర్షా అనే సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా అద్వానీ.. సిద్ధార్థ్తో తనకున్న రిలేషన్షిప్పై పెదవి విప్పింది.
సిద్ధార్థ్ మల్హోత్రా తనకు మంచి స్నేహితుడని.. సినీ ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సన్నిహితుడు అతడే అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి గురించి ప్రస్తావించగా.. మ్యారేజ్ ఎప్పుడు చూసుకుంటానో తెలియదు కానీ.. అరెంజ్డ్ మ్యారేజ్ మాత్రం చేసుకోనని చెప్పింది. ఎప్పటికైనా లవ్ మ్యారేజినే చేసుకుంటానని స్పష్టం చేసింది. కియారా అద్వానీ ఇప్పుడు రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్లో విలన్గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ల్లోనూ హీరోయిన్ల హవా