ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్సియల్ హీరోయిన్లలో టాప్ ప్లేస్లో ఉంటుంది కంగనా రనౌత్ (Kangana Ranaut). ఏదో ఒక బోల్డ్ స్టేట్ మెంట్స్తో చిక్కుల్లో పడుతూ ఉంటుంది. పాపులర్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ (Javed Akhtar) ఓ టీవీ ఇంటర్వ్యూలో తనను కించపరిచాడంటూ కొన్ని నెలల క్రితం కంగనా వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కంగనాపై జావెద్ అక్తర్ పరువు నష్టం దావా (defamation case) వేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి ఇవాళ కంగనా ముంబై కోర్టు (Mumbai court) ఎదుట హాజరైంది. కంగనా చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దిగజార్చాయని, తనకు మానసికంగా బాధ కలిగించాయని తన కేసులో పేర్కొన్నారు జావెద్. మరి ఈ కేసులో ముంబై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నదని తెలియాల్సి ఉంది. కంగనా ఇటీవలే ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
మరోవైపు ఎమర్జెన్సీ టైటిల్తో కొత్త సినిమా కూడా ప్రకటించింది కంగనా. దీంతోపాటు కంగనా ఖాతాలో మరో రెండు ప్రాజెక్టులున్నాయి. వీటిలో తేజాస్ షూటింగ్ పూర్తయింది. నిర్మాతగా టికు వెడ్స్ షేరు చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.