టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందంటే ఠక్కున గుర్తొచ్చేది మహేశ్ బాబు (Mahesh Babu)-ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమోనని ఎప్పటికపుడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని, బేసిక్ ఐడియాను జక్కన్న ఫైనల్ చేశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా ఇపుడు పాపులర్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..తాను, రాజమౌళి ఇప్పటికీ సినిమాపై సమాలోచనలు చేస్తున్నామని, కానీ ఇప్పటివరకు ఎలాంటి బేసిక్ ఐడియా రాలేదని అనడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వార్తల్లో నిజమెంతుందో పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ అప్ డేట్ చూసిన కొందరు మహేశ్ బాబు అభిమానులు..ఈ సినిమా మరింత ఆలస్యమవనుందేమోనని నిరాశచెందుతున్నారన్న టాక్ నడుస్తోంది.
సాధారణంగా జక్కన్న సినిమాలంటే చాలా టైం తీసుకుంటాడని తెలిసిందే. అయితే ఇప్పటివరకు బేసిక్ ఐడియా కూడా రాలేదన్న విజయేంద్రప్రసాద్ కామెంట్స్ తో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారని జోరుగా చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి దీనిపై రానున్న రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. రీసెంట్గా ఫ్యామిలీ ట్రిప్ను ఫుల్ ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు త్వరలోనే త్రివిక్రమ్తో చేయబోయే ssmb28 ప్రాజెక్టు షూటింగ్లో పాల్గొననున్నాడు.