ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేడు ఆంధప్రదేశ్లోని భీమవరంలో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆర్కే రోజా (RK Roja)తోపాటు టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (PM Modi) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి రోజా ప్రధాని మోదీ, సీఎం జగన్తో సెల్ఫీ (RK Roja Selfie) దిగారు. అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవితో సెపరేట్గా మరో సెల్ఫీ దిగారు. మంత్రి రోజా దిగిన సెల్ఫీలు ఇపుడు నెట్టింట్టో ట్రెండింగ్ అవుతున్నాయి. రోజా, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు పబ్లిక్ ఈవెంట్లో ఒకే ఫ్రేమ్లో కనిపించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆర్కే రోజా మంత్రి అయిన తర్వాత జబర్దస్ కామెడీ షోకు గుడ్ బై చెప్పి..పూర్తి స్థాయిలో ప్రజా కార్యక్రమాలకు టైం కేటాయిస్తున్నారు.