అమరాతి : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పొన్నూరు డీవీసీ కాలనీలో నివాసముంటున్న మేళం చిరంజీవి( 37) , బర్కతునిస్సా ( 35 ) అనే ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పొన్నూరు పోలీసులు వెల్లడించారు.