తుంగతుర్తి, ఆగస్టు 13 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సీతయ్య మాట్లాడుతూ.. ప్రతి దళిత కుటుంబానికి అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇవ్వలేదని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములుగౌడ్, గోపగాని రమేశ్ పూర్ణ నాయక్, వీరోజీ నాయక్, సుధాకర్ నాయక్, సర్పంచ్ తప్పేట్ల ఎల్లయ్య, మాతంగి కరుణాకర్, ఆకారపు భాస్కర్, కదారిదాసు, పోలెపాక సోమయ్య, బల్లెం ప్రవీణ్, చింతకుంట్ల భాస్కర్, శ్రీనివాస్, పరమేశ్, గడ్డం సోమేశ్, మల్లేపక కరుణాకర్, దుబ్బాక విజయ్, శ్రావణ్, పుల్లూరి పరశురాం, బొంకూరి శ్యాంసుందర్, కొండగడుపుల వెంకటేష్, బొంకూరి సాయి, పోలేపాక పరమేశ్ పాల్గొన్నారు.