రామగిరి, సెప్టెంబర్ 17 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్ల బ్యాక్లాగ్, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు గురువారం యూనివర్సిటీలోని తన ఛాంబర్ లో సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డితో కలిసి రిజిస్టర్ కె.అంజిరెడ్డి విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ఏ.ప్రవళిక పాల్గొన్నారు.
– IV సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) : మొత్తం 1,265 మంది విద్యార్థులకు గాను 967 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 76.44% కాగా, 297 మంది (23.48%) ఫెయిల్ అయ్యారు. ఒక విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదైంది.
– III సెమిస్టర్ (బ్యాక్లాగ్) : మొత్తం 344 మందిలో 168 మంది (48.84%) ఉత్తీర్ణులు కాగా, 176 మంది (51.16%) ఫెయిల్ అయ్యారు.
– II సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 382 మందిలో 65 మంది (17.02%) ఉత్తీర్ణులు కాగా, 316 మంది (82.72%) ఫెయిల్ అయ్యారు. ఒక మాల్ప్రాక్టీస్ కేసు నమోదైంది.
– I సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 427 మందిలో 158 మంది (37.00%) ఉత్తీర్ణులు కాగా, 267 మంది (62.53%) ఫెయిల్ అయ్యారు. ఇద్దరిపై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.