దక్షిణాది సినీ పరిశ్రమ (South Indian film industry)లో టాలెంటెడ్, గ్లామరస్ హీరోయిన్లకు కొదవేమి లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందాల భామలు సాయిపల్లవి (Sai Pallavi ), కల్యాణి ప్రియదర్శిని (Kalyani Priyadarshan), ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan), కృతిశెట్టి (Krithi Shetty)ఈ జాబితాలోకే వస్తారు. వీరంతా తమ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నవారే. ఒకప్పుడు ఎంతో కష్టపడితే కాని రానీ క్రేజ్ ఈ బ్యూటీస్కు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని తక్కువ కాలంలోనే వచ్చేసింది. ఒక్కొక్కరూ ఒక్కో స్కిల్తో అదరగొట్టేస్తుంటారు.
ఈ సుందరీమణులంతా ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన సందర్భం ఒకటి వచ్చింది. ఓ ఈవెంట్లో కలిసిన వీరంతా సెల్ఫీ దిగారు. ప్రియాంకా మోహన్ తన కోస్టార్ల పక్కనే కూర్చొని సెల్ఫీ తీసింది. ఈ స్టిల్ను కల్యాణి ప్రియదర్శిని ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందరినీ రూల్ చేయడానికి ఒక్క ఫొటో..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సినిమాల విషయానికొస్తే ఈ నలుగురు హీరోయిన్లు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.
వీరందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే..అందరూ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న వారే. సాయిపల్లవి త్వరలో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కృతిశెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్తో ది వారియర్ సినిమాలో నటిస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం మూడు మలయాళ సినిమాలు చేస్తోంది. ప్రియాంకా మోహన్ సూపర్ స్టార్ రజినీకాంత్తో 169 ప్రాజెక్టు చేస్తోంది.