ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి ( Sai Pallavi) . తన డ్యాన్స్, యాక్టింగ్తో సిల్వర్ స్క్రీన్పై కోస్టార్స్ కు గట్టి పోటీనిస్తుంది. న్యాచురల్గా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ..నటించే సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లలోనే ఉంటుంది. అయితే ఎంత స్టార్ డమ్ వచ్చినా సింఫుల్ ఉండేందుకే ఈ భామ ఎక్కువగా ఇష్టపడుతుంది. కానీ స్టార్ హీరోయిన్ కావడం, క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఎక్కడికి వెళ్దామన్నా ప్రైవసీ కష్టమవుతుంటుంది.
ఈ భామకు తనకిష్టమైన హీరోల సినిమాలను అందరిలా సాధారణంగా థియేటర్లకు వెళ్లి చూడాలనుకుంటుంది. మొత్తానికి తాను అనుకున్నట్టుగానే సింపుల్గా సినిమాకు వెళ్లింది సాయిపల్లవి. ఇంతకీ ఈ చిన్నది వెళ్లిన సినిమా ఏంటో తెలుసా..? మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). బంజారాహిల్స్ లోని పీవీఎక్స్ ఆర్కే ప్లెక్స్ (సినీ మ్యాక్స్) (Cinemax)లో సినిమా చూసింది. అయితే సాయిపల్లవి మాత్రం తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని ముఖాన్ని కవర్ చేస్తూ తలపై స్కార్ఫ్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని , చేతికి హ్యాండ్బ్యాగ్ వేసుకొని థియేటర్కు వచ్చింది.
కానీ తనను ఎవరూ చూడలేదనుకుంటుండగానే..ఎవరో వ్యక్తి సాయిపల్లవిని గుర్తించి కెమెరాతో క్లిక్మనిపించారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్చేస్తోంది. ఇక తమ ఫేవరేట్ హీరో మహేశ్ బాబు సినిమాను అందరిలా థియేటర్కు సింపుల్గా వచ్చి..సినిమాను ఫుల్ ఎంజాయ్ చేసిన సాయిపల్లవిని చూసి ఆనందంలో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు