కొంతకాలంగా తెలుగు సినిమాలు (Telugu Cinemas) నేషనల్, గ్లోబల్ బాక్సాపీస్ను షేక్ చేస్తున్నాయి. తెలుగు సినిమాలకు వస్తున్న క్రేజ్ను బాలీవుడ్ (Bollywood) దర్శకనిర్మాతలు, హీరోలు సైతం కాదనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు, హిందీ మీడియా ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రాంతీయ సినిమాల విజయాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో లేరనే చెప్పాలి. దక్షిణాది సినిమాలకు వస్తున్న క్రేజ్ను చూసి కుళ్లుకుంటున్నారు కొంతమంది హిందీ ప్రముఖులు.
అయితే రీసెంట్గా తెలుగులో ప్లాప్ టాక్ మూట గట్టుకున్న భారీ బడ్జెట్ సినిమాలు అలాంటివారిలో ఎనర్జీని ఇస్తున్నాయట. రీసెంట్గా రిలీజైన భారీ బడ్జెట్ సినిమాలు ప్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో బీటౌన్ మీడియా (BTown Media) ఇపుడు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటుందన్న న్యూస్ ఒకటి హాట్ టాపిక్గా మారిపోయింది.
బాలీవుడ్ బ్యాడ్ టైమ్లో ప్రయాణిస్తోందని..అయితే దక్షిణాది సినీ పరిశ్రమకు కూడా పరిస్థితులు అంత బాగా ఏమీ లేవంటూ..సంతోషంలో మునిగిపోతుందట ఒక ప్రముఖ బీటౌన్ మీడియా హౌస్. తాజా టాక్ ప్రకారం రీసెంట్గా రిలీజైన ఆచార్య (Acharya) చిత్రం రూ.100 కోట్ల వరకు నష్టాలు మూటగట్టుకుంది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్ (Radhe Shyam) రూ.75 కోట్ల వరకు నష్టపోయింది.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాఫ్టర్ 2 మరోసారి బాక్సాపీస్ను షేక్ చేయడంతో డీలా పడిపోయిన బాలీవుడ్ మీడియా..రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలవడంతో..సౌత్ సినిమాల క్రేజ్ కూడా తగ్గిపోతుందని సెలబ్రేషన్స్ చేసుకుంటుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.