టాలీవుడ్లో రాబోతున్న మల్టీస్టారర్ ఎఫ్ 3 (F3). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటిస్తున్నారు. మే 27న థియేటర్లలో గ్రాండ్గా విడుదలయేందుకు రెడీ అవుతోంది. తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు టికెట్స్ ధరలను తెలంగాణ, ఏపీలో పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ 3 విషయంలో మాత్రం అలాంటి నిర్ణయమేం తీసుకోవడం లేదట మేకర్స్.
ఎఫ్ 3 నిర్మాతలు స్టాండర్డ్ టికెట్ ధరలనే కొనసాగించాలని ఫిక్సయినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. కాగా దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొంతకాలంగా రాధేశ్యామ్, ఆచార్య టికెట్స్ రేట్లను పెంచడంతో బుకింగ్స్ పై ప్రభావం చూపించిందని, ఈ సినిమాలు బాక్సాపీస్ వద్ద డిజాస్టర్గా నిలవడంలో టికెట్ల ధరల పెంపు కూడా ఓ కారణమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎఫ్ 3 నిర్మాతలు టికెట్స్ ధరల పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్టు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే రెగ్యులర్ టికెట్లపైనే విడుదలవుతున్న తొలి తెలుగు భారీ సినిమాగా ఎఫ్ 3 నిలువనుంది.
2018లో వచ్చిన ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రాన్నికి సీక్వెల్గా వస్తోంది ఎఫ్ 3. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో సోనాల్ చౌహాన్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాలపై అంచనాలు మరింత పెంచేస్తుంది.