రీసెంట్గా రిలీజైన మోస్ట్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో ఒకటి సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata). ఈ సినిమా సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). బాక్సాపీస్ వద్ద మహేశ్ తొలి రోజు నుంచి తన రేంజ్కు తగ్గకుండా కలెక్షన్లను రాబడుతున్నాడు. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఖాతాలో అరుదైన ఫీట్ చేరిపోయింది. యూఎస్లో తన సినిమా ఫిగర్ను తానే అధిగిమించి టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు టాలీవుడ్ సూపర్ స్టార్. తాజా టాక్ ప్రకారం యూఎస్లో సరిలేరు నీకెవ్వరు (Sarlieru Neekevvaru) సినిమా కలెక్షన్లను క్రాస్ చేసింది సర్కారు వారి పాట.
యూఎస్(US)లోని 155 లొకేషన్లలో ఆదివారం సర్కారు వారి పాట 26,573 (రూ.20 లక్షలకుపైగా) మిలియన్ డాలర్లు రాబట్టింది. దీంతో యూఎస్లో మొత్తం కలెక్షన్లు 2,291,728 మిలియన్ డాలర్లు (రూ.17.77 కోట్లకుపైగా) రాబట్టిందని ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా ఈ చిత్రం యూఎస్లో సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టాలట. కాగా మహేశ్ గతేడాది నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం యూఎస్లో 2,288,613 మిలియన్ డాలర్లు (రూ.17.74 కోట్లకుపైగా) వసూలు చేసి..యూఎస్లో మహేశ్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
కాగా ఇపుడు సర్కారు వారి పాట తాజా గణాంకాలతో ఈ ఫిగర్ను అధిగమించి తన రికార్డు తానే బ్రేక్ చేసి..ఔరా అనిపించాడు మహేశ్ బాబు. మరి రాబోయే రోజుల్లో సర్కారు వారి పాట యూఎస్లో ఎంత రాబడుతుందో వేచి చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.