అల్లరి సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిశాడు నరేశ్ (Allari Naresh). ఈ సినిమా టైటిల్నే సర్నేమ్గా ఫిక్స్ చేసుకున్నాడు. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్ తర్వాత కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్లో యూటర్న్ తీసుకుని పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత గతేగాది నాంది (Naandi) సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ హీరో ప్రస్తుతం మారెడుమిల్లి ప్రజానీకం ( Maredumilli Prajaneekam) చిత్రంలో నటిస్తుండగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని కలుగజేస్తూ..సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
కాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ స్కూల్ టీచర్గా కనిపించబోతున్నాడట. సీరియస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేశ్ ఓ గ్రామంలో ఎలక్షన్ డ్యూటీకి వెళ్లే టీచర్గా కనిపించనున్నాడని టాక్. నరేశ్ పాత్ర ఇదివరకెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆనంది (Anandhi)హీరోయిన్గా నటిస్తోంది.
హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్. మొత్తానికి నాంది సినిమా తర్వాత కథల ఎంపికలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్న నరేశ్ ఈ సారి టీచర్గా ఎలా కనిపించబోతున్నాడన్నది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.