హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలానగర్ ఫ్లై ఓవర్కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ నటుడు సోనూసూద్ మంత్రి కేటీఆర్ను మంగళవారం ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలను కేటీఆర్ అభినందించారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని ఈ సందర్భంగా సోనూసూద్ తెలిపారు.
ప్రభుత్వ టీకా కేంద్రాల్లో త్వరలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉచితంగా లభించనుంది. ప్రస్తుతం టీకా కేంద్రాల్లో కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మాత్రమే ఉచితంగా వేస్తున్నారు. ఇప్పుడిక ఈ జాబితాలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా కూడా చేరుతుంది. దేశంలో అత్యవసర వినియోగానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరదనీరు ఏరులై పారింది. ఆఫీసు వేళలు ముగిసి ఇంటికి చేరుకునే సమయంలో వర్షం పడటంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, ఒడిషా, పశ్చిమబెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 8న కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. కొత్తగా 22 మందికి కేంద్ర కేబినెట్లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
దేశంలో 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. ఈ 8 మందిలో నలుగురు కొత్త వారు కాగా, మిగిలిన నలుగురు బదిలీ అయ్యారు. హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయకు స్థాన చలనం కలుగగా, ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ అయ్యారు.
పర్యావరణ హిత పర్సనల్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు ఉండబోవని ఆ జీవోలో స్పష్టం చేసింది.
పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సోమవారం సీఎం కేసీఆర్ను కలిశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు ఆయనకు అందజేశారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రత్యక్షంగా వెబ్నార్లలో ఎన్నో కార్యక్రమాలలో పీవీకి భారత రత్న ఇవ్వాలని పలు కార్యక్రమాలను నిర్వహించారు. అదే విషయంపై 80 పైచిలుకు ఎన్నారై, ఎన్నారై సంస్థల తరఫున మహేష్ సీఎం కేసీఆర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
అమెరికా కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ ‘సంపద’ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ నెల జులై 4న అంతర్జాల మాధ్యమాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది లబ్దప్రతిష్టులైన కళాకారులు హాజరై బాల మురళీ కృష్ణతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు.
అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ సైడ్ బీములు కిందపడటంతో ఒక కారు, ట్యాంకర్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు సీట్ల కింద నలిగిపోయి ఒక బాలుడు, యువకుడు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.48,440కి చేరింది. కిలో వెండి ధర రూ.75వేల వద్ద స్థిరంగా ఉంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 389 పెరిగి రూ.46,762కు చేరింది. కిలో వెండి ధర రూ.397 పెరిగి రూ.69,105 వద్ద ముగిసింది.
ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేక తీరథ్సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేల్కొన్నారు. రేపు తనకూ అదే పరిస్థితి ఎదురుకాకుండా ఉండటం కోసం రాష్ట్రంలో కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. ఒకవేళ గడువులోగా ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేకపోయినా మండలిలో ఎమ్మెల్సీ పదవి చేపట్టి ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేకుండా చూసుకోవచ్చని ఆమె భావిస్తున్నారు. అ మేరకు ఇవాళ బెంగాల్లో శాసన మండలి ఏర్పాటుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు.
దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్వల్పస్థాయిలో సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కఠినమైన నియమావళి వల్లనే కొవిడ్ అదుపులోకి వచ్చిందని, ఒకవేళ ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ ఆంక్షలను విధిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు కాగా.. నలుగురు టీం మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నట్లు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారందరూ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. అయితే పాకిస్థాన్తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్లు మాత్రం కొనసాగుతాయని ఈసీబీ స్పష్టం చేసింది.
కాసేపట్లో పలానా ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సిన రష్యన్ విమానం ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 26 మంది ప్రయాణికులు ఉన్నారని వార్త సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది.
ప్రపంచ కుబేరుల్లో ఇప్పటికీ జెఫ్ బెజోస్ టాప్లోనే ఉన్నారు. విడాకులు తీసుకొని భార్యకు భారీ భరణం చెల్లించినా, తాను స్థాపించిన సంస్థ అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నా.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఇంకా టాప్లోనే ఉన్నారు జెఫ్ బెజోస్. తాజాగా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం బెజోస్ సంపద విలువ సుమారు రూ.15లక్షల కోట్లు.