న్యూఢిల్లీ : దేశంలో 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు కొత్త వారు కాగా, మిగిలిన నలుగురు బదిలీ అయ్యారు. గవర్నర్ బండారు దత్తాత్రేయకు స్థాన చలనం కలుగగా, ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ అయ్యారు. మిజోరం గవర్నర్గా కొనసాగుతున్న పీఎస్ శ్రీధరన్ పిళ్లై గోవా గవర్నర్గా, హర్యానా గవర్నర్గా కొనసాగుతున్న సత్యదేవ్ నారాయణ్ త్రిపుర గవర్నర్గా, త్రిపుర గవర్నర్గా కొనసాగుతున్న రమేశ్ బైస్ జార్ఖండ్ గవర్నర్గా నియామకం అయ్యారు.
మిజోరం గవర్నర్ – కంభంపాటి హరిబాబు
మధ్యప్రదేశ్ గవర్నర్ – మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ – రాజేంద్ర విశ్వనాథ్
కర్ణాటక గవర్నర్ – థావర్ చంద్ గెహ్లాట్