లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఒకేసారి ఏడుగురు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో ముగ్గురు ప్లేయర్స్ కాగా, నలుగురు టీమ్ మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. సోమవారం వీరికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. మంగళవారం పాజిటివ్గా రిపోర్ట్ వచ్చినట్లు తెలిపింది. మిగతా టీమ్ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా వీళ్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఈసీబీ చెప్పింది. పాజిటివ్గా తేలిన ప్లేయర్స్, సపోర్టింగ్ స్టాఫ్ సభ్యులతోపాటు వాళ్లతో సన్నిహితంగా ఉన్న వాళ్లు కూడా ఐసోలేషన్లో ఉన్నారు.
అయితే పాకిస్థాన్తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్లు మాత్రం కొనసాగుతాయని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ సిరీస్కు బెన్ స్టోక్స్ను కెప్టెన్గా ప్రకటించారు. కాసేపట్లో మిగిలిన టీమ్ను కూడా ఈసీబీ ప్రకటించనుంది.