మాస్కో : మరికొద్ది నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సిన రష్యన్ విమానం ప్రమాదవశాత్తూ మంగళవారం సముద్రంలో కూలిపోయింది. పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు 28 మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్పోర్ట్కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఆ ప్రాంతంలో మేఘాలు కమ్ముకున్నాయని అధికారులు వెల్లడించారు.
ఆరుగురు సిబ్బందితో పాటు 26 మంది విమానంలో ఉన్నారని వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. మే 2019లో చివరిసారిగా రష్యాలో భారీ విమాన ప్రమాదం జరిగింది. సుఖోయ్ సూపర్జెట్ విమానం మాస్కో ఎయిర్పోర్ట్ రన్వేపై అగ్నిప్రమాదంలో చిక్కుకుపోవడంతో 41 మంది మరణించారు.