హైదరాబాద్ : విదేశాల్లో పీవీ జయంతి శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా సమన్వయం చేసినందుకు పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలను సీఎం కేసీఆర్ అభినందించారు. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్ఐ సంస్థలను కూడా సీఎం ప్రశంసించారు. ఏడాది పొడవునా నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు 28 జూన్,2021న విజయవంతంగా పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహేశ్ బిగాల సీఎం కేసీఆర్ను కలిశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు అందజేశారు.
అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిర్వహించిన వెబ్నార్లలో పీవీకి భారతరత్న ఇవ్వాలని వచ్చిన డిమాండ్ను మహేష్ బిగాల ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై 80 పైచిలుకు ఎన్నారై, ఎన్నారై సంస్థల తరఫున సీఎం కేసీఆర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పీవీకి భారతరత్న అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా సీఎంను కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశానుసారం, పీవీ సెంటెనరీ కమిటీ చైర్మన్ మార్గదర్శకత్వంలో మంత్రి కేటీఆర్తో కలిసి పీవీ సెంటెనరీ కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కన్వీనర్ మహేష్ బిగాలా పీవీ శతాబ్ది ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో విజయవంతంగా సమన్వయం చేశారు. వివిధ దేశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. యూఎస్ఏ, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, మారిషస్, డెన్మార్క్, స్వీడన్, న్యూజిలాండ్, లాట్వియాతో పాటు అనేక దేశాల్లో శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో అతిథులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాలలో కమిటీ చైర్మన్ కేశవరావు, ఎంఎల్సి కవిత, ఎంఎల్సి వాణి దేవి, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, చెన్నమనేని రమేష్, ఎమ్మెల్యే, పీవీ మనవడు కశ్యప్, పలువురు అతిథులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల