బీజింగ్: ఒలింపిక్ గేమ్స్ కోసం చైనా ఓ భారీ టీమ్ను పంపడానికి సిద్ధమవుతోంది. 2016 రియో ఒలింపిక్స్లో ఏకంగా 416 మందిని పంపిన ఆ దేశం.. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని చూస్తోంది. ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్ కోసం చైనా నుంచి ఇప్పటికే 30 క్రీడల్లో 224 ఈవెంట్స్ కోసం 318 మంది క్వాలిఫై అయినట్లు జినువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 2016 గేమ్స్లో చైనా నుంచి 26 క్రీడల్లో 210 ఈవెంట్లలో మొత్తం 416 మంది అథ్లెట్లు పాల్గొన్నారు.
ఈసారి డైవింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించాలని చైనా చూస్తోంది. ఇవి కాకుండా బ్యాడ్మింటన్, తైక్వాండో, సెయిలింగ్, రోయింగ్, కరాటె, వుమెన్స్ బాక్సింగ్, వుమెన్స్ వాలీబాల్, స్విమ్మింగ్లలోనూ మెడల్స్ ఆశిస్తోంది. అయితే 37 ఏళ్లలో తొలిసారి చైనా మెన్స్ బాస్కెట్ బాల్ టీమ్ మాత్రం ఒలింపిక్స్కు క్వాలిఫై కాలేదు.