సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేటలో మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఐదు కోట్ల యాభై లక్షలతో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు, ఐదు కోట్ల రూపాయలతో సమీకృత కూరగాయల మార్కెట్, శ్మశాన వాటికలను ఆయన ప్రారంభించారు. అలాగే పట్టణంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, సెంట్రల్ లైటింగ్ సిస్టం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.