టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)-విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజీ కాంబోలో రెండోసారి రాబోతున్న ప్రాజెక్టు జనగణమన (Jana Gana Mana). పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేజీఎం టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ మూవీని ఛార్మీ, వంశీపైడి పల్లి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆర్మీ, వార్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమా లాంఛింగ్ తోనే అంచనాలను అమాంతం పెంచేశాడు పూరీ జగన్నాథ్. జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నట్టు వార్తలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది జాన్వీ. ‘పుకార్లను నమ్మకండి. నేనిప్పటి వరకు ఏ తెలుగు సినిమా కానీ, తమిళ సినిమా కానీ ఓకే చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమాకు సంతకం చేస్తే..నేను కానీ, నా ప్రొడక్షన్ హౌజ్ కానీ ఆ విషయాన్నిప్రకటిస్తుంది.. ‘అని స్పష్టం చేసింది జాన్వీకపూర్. తాజా స్టేట్మెంట్ తో శ్రీదేవి కూతురు ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి ఒకే చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది.
జేజీఎం షూటింగ్ ఏప్రిల్ నుంచి షురూ కాన్నట్టు తెలుస్తోంది 2023 ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు పూరీ అండ్ టీం ప్లాన్ రెడీ చేసుకుంది. విజయ్-పూరీ కాంబినేషన్లో ఇప్పటికే తెరకెక్కుతున్న లైగర్ ఆగస్టు 25న విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా విడుదల కాకముందే నిన్ను కోరి, మజిలీ ఫేం డైరెక్టర్ శివ నిర్వాణతో లవ్స్టోరీతో రాబోతున్న సినిమాను లాంఛ్షురూ చేశాడు.
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ నిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు చూసుకున్నాడు. తెలుగులో అవార్డులు అందుకున్న జెర్సీ మరి హిందీలో ఎలాంటి రికార్డులు సృష్టించిందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.