సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీలు దొరికితే తన పిల్లల కోసం టైం కేటాయిస్తుంటాడని తెలిసిందే. చాలా కాలం తర్వాత తన మాజీ భార్య రేణూదేశాయ్ (Renu Desai), పిల్లలతో కలిసి కనిపించాడు పవన్. వీరంతా ఒక్కచోట చేరడానికి ఏదైనా స్పెషల్ ఉందనుకుంటున్నారా..? పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరయ్యాడు. కూతురు ఆద్య కూడా ఈ ఫొటోలో చూడొచ్చు.
చాలా కాలం క్రితమే పవన్-రేణూదేశాయ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వైవాహిక బంధానికి స్వస్తి పలికినా..తమ మధ్య అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. పవన్ కూడా తన పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లేందుకు, వారితో టైం స్పెండ్ చేసేందుకు రెడీగా ఉంటాడు. అకీరా, ఆద్య, పవన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ..ఓ యుగం ముగిసింది..మరో యుగం మొదలైంది.
‘ఇక ఉదయాన్నే పాఠశాలకు రెడీ అవడం అవసరం లేదు. బస్సు టైమింగ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. భోజనం సిద్దం చేయాలనే తొందర లేదు. ట్యూషన్లు లేవు, పేరెంట్స్ , టీచ్స్ మీటింగ్ లేదు, స్కూల్ లేదు…అద్బుతమైన బాలుడి (అకీరా) గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొనడం తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం..నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలైందని అకీరాతో చెప్పాను. అకీరా తల్లిదండ్రుల అవసరం లేకుండా తన సొంత ధ్యేయాన్ని ఏర్పరచుకొని..ఎదుగుతాడని ఆశిస్తున్నా. నా లిటిల్ బేబి చాలా వేగంగా ఎదిగాడు..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది రేణూదేశాయ్ .