కోయిలకొండ, ఏప్రిల్ 20 : ప్రతి ఎకరాకూ సాగు నీరు అందివ్వడమే లక్ష్యంగా వాగుల్లో కత్వ, చెక్డ్యామ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మోదీపూర్ వాగులో రూ.6 కోట్ల 88 లక్షలతో నిర్మిస్తున్న కత్వ, చెక్డ్యామ్ నిర్మాణానికి మంగళవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మోదీపూర్ కత్వ నిర్మాణంతో నాలుగు చెరువులకు నీరు అంది 300 ఎకరాలు సాగవుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు పెద్దవాగులో మరో నాలుగు చెక్డ్యామ్ల ని ర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో వాగు లో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండి పరిసర వ్యవసాయ బో రు బావుల్లో నీటి మట్టం పెరుగుతుందన్నా రు. పాలమూర్ ఎత్తిపోతల పథకంతో జూ రాలకు పెద్దవాగుల మీదుగా నీరు వెళ్తున్నద న్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మం డలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని వెల్లడించారు. అనంతరం కోయిలకొండలో 152 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి, గార్లపాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమ ంలో నవోదయ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి మ ండలా ధ్యక్షుడు మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారు లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.