టాలీవుడ్ భామ శృతిహాసన్ ప్రస్తుతం మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు సలార్ లో నటిస్తోంది. ప్రభాస్ -శృతిహాసన్ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడం, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. శృతిహాసన్ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతుందట.
తాజా అప్ డేట్ ప్రకారం శృతిహాసన్ పొలిటికల్ జర్నలిస్టుగా కీ రోల్లో మెరువనుందని ఇన్సైడ్ టాక్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, టెక్నీకం టీం సంబంధిత అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ దీంతోపాటు మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సలార్ పూర్తవగానే నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనున్నాడు.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ