తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉంది.ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన డాక్టర్ జీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ తెచ్చుకుంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ దీపావళి (Diwali) సందర్భంగా తనకు గతంలో ఎదురైన ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంది.
నేషనల్ మీడియాతో చేసిన చిట్చాట్లో రకుల్ మాట్లాడుతూ..’అది చాలా గుర్తుండిపోయే దీపావళి. మా నాన్న నాకు రూ.500 నోటు (Rs 500 Note)ఇచ్చారు. ఆ తర్వాత ఆ నోటు కాల్చమన్నారు. నాన్న అలా ఎందుకు కాల్చేయమన్నాడో షాకయ్యా. కానీ ఆలోచిస్తే సరిగ్గా మీరు చేస్తున్న పని అదే. మీరు టపాసులు కొని వాటిని కాల్చేస్తున్నారు. మీరు ఆ డబ్బుతో కొన్ని చాకోలేట్స్ కొని పేదలకు ఇస్తే ఎలా ఉంటుందని’ చెప్పుకొచ్చింది.
‘నేను ఓ పదేళ్ల వయస్సున్నపుడనుకుంటా.. దుకాణానికి వెళ్లి మిఠాయిలు కొని నిరాశ్రయులకు పంచినట్లు నాకు గుర్తుంది. ఆ రోజు నేను కొత్త అనుభూతిని, ఆనందాన్ని పొందాను. అప్పటి నుండి నేను టపాసులు పేల్చలేదంటూ చెప్పుకొచ్చింది’ రకుల్ ప్రీత్సింగ్. ఏదేమైనా పర్యావరణాన్ని కలుషితం చేసే టపాసులు పేల్చడం మానేసి పేదవారి అవసరాలను తీర్చే దిశగా ఆలోచించాలని సూచిస్తున్న రకుల్కు నెటిజన్లు సలామ్ చేస్తున్నారు.
రకుల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన థ్యాంక్ గాడ్ అక్టోబర్ 25న విడుదలైంది. ప్రస్తుతం రకుల్ తమిళంలో రెండు, హిందీలో రెండు, తెలుగు, తమిళ ప్రాజెక్ట్ ఒకటి చేస్తోంది.
Rakul Preet Singh | స్లీవ్ లెస్ అందాలతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్ల్యాండ్ లెటర్తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : Lokesh Kanagaraj | ఒకేసారి దళపతి 67, ఖైదీ 2 అప్డేట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో