జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు నందమూరి చిన్నోడు. కేవలం 20 ఏళ్ళ వయసులో నెంబర్ వన్ కుర్చీ కోసం పోటీ పడ్డాడు. అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో మంచి విజయాలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. 2003లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 27 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రావడానికి ప్రధాన కారణం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ ఈ సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపడ్డారు. సింహాద్రి సినిమా వెనక ఇంకా చాలా పెద్ద కథ ఉంది అంటూ ఆయన ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ సినిమా కథ ఎప్పుడో రాసిపెట్టి ఉన్నది అని.. నిజానికి బాలయ్యతో సింహాద్రి సినిమా చేయాలని చెప్పాడు విజయేంద్రప్రసాద్. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా చేయాల్సి ఉన్నా.. ఆ కథ ఆయనకు నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్లలేదు అని చెప్పాడు విజయేంద్రప్రసాద్. అప్పటికే అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజుతో రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో తన కొడుకు కోసం అయితే సింహాద్రి కథ ఇస్తాను అంటూ తాను చెప్పడం.. అందులోకి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. అసలు ఈ కథ పుట్టడం వెనుక మరో కథ కూడా ఉంది.
చెన్నైలో ఒకసారి విజయేంద్రప్రసాద్ తన అసిస్టెంట్ తో కలిసి వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడు.. సింహాద్రి సినిమా ఆలోచన పుట్టింది. క్లైమాక్స్ లో కమల్ హాసన్ ను చూసి హీరోయిన్ శ్రీదేవి గుండెల్లో గుచ్చేసి వెళ్లిపోయింది కదా అని సరదాగా తన అసిస్టెంట్ తో అన్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇది ఇంటర్వెల్ గా చేసి కథ రాయడం మొదలు పెట్టామంటూ చెప్పుకొచ్చాడు ఈయన. అందుకే సింహాద్రి ఇంటర్వెల్లో భూమిక గునపంతో జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో గుచ్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. మొత్తం పూర్తయ్యాక బాలయ్యకు చెప్తే ఒప్పుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ లైన్ లోకి రావడం.. అది చరిత్ర సృష్టించడం అన్నీ జరిగిపోయాయి అంటూ పాత విషయాలు గుర్తు చేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్.
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..