టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో టాలీవుడ్ (Tollywood) నిర్మాతలు నారాయణ్దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పటివరకు తెలుగు హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల ఈ సారి మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్ ను ఎంపిక చేసుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలుగు, తమిళ ప్రేక్షకులు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. పాలిటిక్స్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ధనుష్ మద్రాసి తెలుగు లీడర్ గా కనిపించబోతున్నట్టు లేటెస్ట్ టాక్. 1950ల నాటి బ్యాక్ డ్రాప్ తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందు మద్రాస్ లో తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్నప్పటి కథ నేపథ్యంలో శేఖర్ కమ్ముల స్క్రిఫ్ట్ సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
ధనుష్ నటిస్తోన్న డీ43, డీ 44 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ముల మొదటి షెడ్యూల్ ను డిసెంబర్లో మొదలుపెట్టనున్నాడు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కనిపించనున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?