dasari narayana rao biopic | సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం వెండితెరకెక్కబోతోంది. దర్శకరత్న పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళ సత్యం దర్వకత్వంలో తాడివాక రమేశ్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శ్రీశైలం సినిమాను నిర్మించింది ఈయనే. దాసరి బయోపిక్ గురించి విషయాలను తెలియజేసేందుకు హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో చిత్ర యూనిట్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధవళ సత్యం తెలియజేస్తూ.. చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి దాసరి నారాయణరావు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎందరికో మార్గదర్శకుడైన దాసరితో నాకు విడదీయలేని అనుబంధమే నన్ను ఈ సినిమా చేసేందుకు పురిగొల్పింది. ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు.. ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తులను కలిసి స్క్రిప్టును అద్భుతంగా రూపొందిస్తున్నాం అని తెలిపాడు. ఇక చిత్ర నిర్మాత తాడివాక రమేశ్ నాయుడు మాట్లాడుతూ.. జాతీయ స్థాయి నటుడు ఈ చిత్రంలో దాసరి పాత్రను పోషిస్తారని తెలిపారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నామని చెప్పారు. కరోనా పరిస్థితులు అదుపులోకి రాగానే షూటింగ్ మొదలు పెడతామని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అల్లుడిని అలా వదిలేశారేం.. సూపర్ మచ్చి ని పట్టించుకోని మెగా హీరోలు
Sankranti | సంక్రాంతికి సినిమా రాకపోయినా రాధే శ్యామ్ పతంగి వచ్చింది..
ఏపీ సీఎం జగన్తో చిరంజీవి మీటింగ్.. భేటీలో ఏం నిర్ణయం తీసుకున్నారంటే..
RRR విడుదలపై స్పందించిన హీరో రామ్చరణ్
ఇన్స్టాగ్రామ్లో సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..