Radhe shaym kites | సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రాకపోయినా ప్రభాస్ వస్తాడు.. పండగ చేసుకుందామని అభిమానులంతా మెంటల్గా ఫిక్సయిపోయారు. ఈ తరుణంలో ఆ సినిమా కూడా వాయిదా పడిందని నిర్మాతలు చెప్పినప్పుడు.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నిరుత్సాహపడ్డారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే రాధే శ్యామ్ రేపే విడుదల అంటూ సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. వైరస్ కారణంగా మరోసారి ప్రభాస్ సినిమా వాయిదా పడింది. దాంతో బాగా హర్ట్ అయిన అభిమానుల కోసం ప్రత్యేకంగా గాలిపటాలు పంపించాడు ప్రభాస్. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇప్పుడు ఇదే జరిగింది.
సంక్రాంతికి సినిమా లేకపోయినా కూడా గాలిపటాలతో పండగ చేసుకోండి అంటూ కైట్స్ మార్కెట్లోకి విడుదల చేశారు రాధే శ్యామ్ టీం. ఇది కూడా ఒకరకంగా సినిమా ప్రమోషన్లో భాగమే. సంక్రాంతి అంటే ఎలాగూ గాలిపటాల పండుగ. అందుకే కైట్స్ విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ గాలిపటాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్, పూజాహెగ్డే సహా మిగిలిన పోస్టర్స్ కూడా ఈ గాలి పటాలపై ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం రాధే శ్యామ్ కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా బాగుంది అంటున్నారు విశ్లేషకులు కూడా. మరోవైపు అభిమానులు కూడా సంక్రాంతికి సినిమా రాకపోయినా కనీసం కైట్స్ తో పండగ చేసుకుందాం అని సర్దుకుంటున్నారు. వాయిదా పడిన రాధే శ్యామ్ మళ్లీ ఎప్పుడు వస్తుంది అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. బహుశా సమ్మర్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇండియాలోనే అత్యంత ఖరీదైన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.