సాక్ష్యం, గూఢచారి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) బ్యానర్ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. ఈ బ్యానర్ ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజా తెలుగు చిత్రం ఇడియట్స్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసింది. అందాల తార కలర్స్ స్వాతి (Colours Swathi) ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ నేపథ్యంలో ఫన్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్తోనే క్యూరియాసిటీని పెంచుతున్నాడు దర్శకుడు.
ఆదిత్యా హాసన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నిఖిల్ దేవాదుల, సిద్దార్థ్ శర్మ, శ్రీ హర్ష, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమోఘ ఆర్ట్స్ అండ్ ఎంఎన్ఓపీ కో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సిద్దార్థ్ సదాశివుని మ్యూజిక్ కంపోజర్ కాగా..అజమ్ మహ్మద్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. కొబ్బరి చెట్టు ఊళ్లోకి వెళ్లే రోడ్డు..ఆ పక్కనే చెరువు గట్టు, సినిమా పాత్రలో బ్యాక్ డ్రాప్లో ఉన్న పోస్టర్ ..సినిమా పక్కా ఎంటర్ టైనింగ్గా ఉండబోతుందని చెబుతోంది.
We’re excited to show you The First look of #IDIOTS
Get ready to experience a set of pure emotions ❤️#IDIOTS-The Real Hero’s 🤟
Director by #AdityaHasan
ShowRunner @NaveenMedaram@Amoghaarts @MNOP @Adityahasan @Azzeem_mohammad @SidharthSadasivuni @SwathReddy @Actorsuresh pic.twitter.com/LkhMvCXHAO
— ABHISHEK PICTURES (@AbhishekPicture) May 5, 2022
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న డెవిల్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది అభిషేక్ పిక్చర్స్. దీంతోపాటు ప్రేమ విమానం సినిమా కూడా నిర్మిస్తోంది.