టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు, పరశురాం (Parasuram) క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగానే మూవీ లవర్స్, మహేశ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందిస్తూ..ట్రైలర్ను విడుదల చేశారు.
‘నా ప్రేమను దొంగిలించగలవు..నా స్నేహాన్ని దొంగిలించగలవు..నా డబ్బును దొంగిలించలేవ్ అంటూ మహేశ్ మార్క్ డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్ అదిరిపోయింది. అమ్మాయిల్ని, అప్పు ఇచ్చే వాళ్లను ప్యాంపర్ చేయాలి రా..రఫ్గా హ్యాండిల్ చేయకూడదంటూ‘ సాగే యాక్షన్ సీన్లు..ఆ తర్వాత కీర్తిసురేశ్, మహేశ్ బాబును ఫాలో అయ్యే లవ్ ట్రాక్, వెన్నెల కిశోర్, మహేశ్ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ అభిమానులకు పక్కా వినోదాన్ని అందించేలా కనిపిస్తున్నాయి.
సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మే 12న విడుదల కానున్న నేపథ్యంలో టీం ప్రమోషన్స్ తో బిజీ అయిపోయింది.
ఈ చిత్రానికి ఎస్ థమన్ కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్గా నిలువనున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.