బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra) థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే రూ.1.5 కోట్లు నష్టం మూటగట్టుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే..? శుక్రవారం సాయంత్రం ఈవెంట్కు ప్లాన్ చేయగా..ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రావాల్సి ఉంది.
కాగా ఎవరూ ఊహించని విధంగా ఈవెంట్ రద్దైంది. ఈ ఈవెంట్కు అనుమతి కూడా ఉంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రద్దీ ఉండే ఛాన్స్ కారణంగా అనుమతి రద్దు చేయబడింది. దీంతో నిర్మాతలు సుమారుగా రూ.1.50 కోట్లు నష్టపోయినట్టు సమాచారం. ఈవెంట్ ప్లాన్ చేసి..అనుకోకుండా రద్దు కావడంతో మేకర్స్ కు ఇంత మొత్తంలో నష్టం జరిగినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ..రామోజీఫిలిం సిటీలో జరగాల్సిన ఈవెంట్ దురదృష్టవశాత్తు రద్దు చేయబడింది. పోలీస్ కమిషనర్ నుంచి బ్రహ్మాస్త్ర మేకర్స్ అన్నీ అనుమతులు తీసుకున్నారు. అయితే పోలీస్ యంత్రాంగం గణేశ్ ఉత్సవాల విధుల్లో బిజీగా ఉండటం వల్ల ఈవెంట్ను రద్దు చేశారని చెప్పారు. ఈవెంట్ను చూడాలని ఎక్జయిటింగ్గా ఎదురుచూసిన నా అభిమానులు, నేషనల్ మీడియాకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని తన సందేశాన్ని ఇప్పటికే అందరితో పంచుకున్నాడు తారక్.
మూడు పార్టులుగా వస్తున్న బ్రహ్మాస్త్రలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , మౌనీరాయ్, టాలీవుడ్ యాక్టర్ నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.